ప్రపోజల్
"ఎంత వేర్రిబాగుల్ది కాకపోతే అలాంటి ప్రపోజల్ కి ఒప్పుకుంటుది తను". అసహనంగా బయటకే అనేసింది వసుంధర. ప్రక్కనే కూర్చున్నకొడుకు తేజ తల్లివైపు చిరాగ్గా చూసి "ఏంటమ్మా ఇది కాసేపు స్తిమితంగా కోర్చోవచ్చుకదా?ఎలాగూ నాన్నగారిదగ్గరికే కదా వెళ్ళేది"కోపంగా ప్రారంభించినా కాస్త ఓదార్పుగానే చెప్పాడు.
ఆటోలో కూర్చుంది అన్న మాటేగాని వసుంధరకు మనసు మనసులో లేదు. తేజ స్మార్ట్ ఫోన్ సహాయంతో "లాటిట్యూడ్"ఉపయోగించి తండ్రి శ్రావణ్ ఉన్న ఏరియాను కనుక్కుంటూ ఆటోడ్రైవర్ కు దారిచూపిస్తున్నాడు.
"ప్రతినెలా ఎనిమిది వేల రూపాయలంటే మాటలా,ఎవరికిస్తున్నాడో ఎం చేస్తున్నాడో ఈరోజు ఆ విశయం తేలి పోవాల్సిందే"ంఅనసులో అనుకున్నాక వసుంధర మనసు తేలిక పడింది.
ఆరోజు పెళ్ళిచూపుల ఘట్టం ఇప్పటికీ మనసులో కదలాడుతూనే ఉంది. తనవాళ్ళు
కట్నకానుకలు పెద్దగా ఇచ్చుకోలేమని చెప్పినపుడు శ్రావణ్ అంతగా డిమాండ్ చేయలేదు. కాని ఒక ప్రపోజల్ పెట్టాడు."నా జీతం ప్రతినెలా నా భార్య చేతిలో పెడతాను;అందులో 10పెర్సెంట్ మాత్రం తీసుకుంటాను ఆ డబ్బులు గురించి ఎప్పుడో నన్ను ప్రశ్నించకూడదు". దీనికి అంగీకరిస్తే ఈ సంబంధం నాకిష్టమే"స్తిరంగా చెప్పాడు శ్రావణ్.
క్షణం పాటు వసుంధరకు అర్థం కాలేదు. వెంటనే తేరుకొని పదిశాతమేకదా పోనీలే అని సర్దుకొని తన అంగీకారం తెలపటం,ఇద్దరు పిల్లల తల్లయిపోవటం,పెళ్ళయి పాతికేళ్ళు గడిచిపోవటం అంతా కలలా జరిగిపోయింది. "ఇక్కడేనమ్మా"
తేజ కుదిపేసరికి ఈ లోకంలోకొచ్చింది వసుందర. ఓ ఇంటిముందు ఆటో ఆగింది. "అదిగో మీ నాన్న బైకు,ఎన్నాళ్లకు దొరికారండి ,నా కళ్లుగప్పి ఏకంగా కాపురమే పెట్టేశారా?ఈ రోజు మీ గుట్టు రట్టుచేస్తాను"వగర్చుతూ బైటికే అనేసింది.కొడుకు వారించబోయాడు
"నీకేం తెలుసురా అప్పుడంటే తక్కువ జీతం కనుక ఒప్పుకున్నాను.ఇప్పుడు 80వేలు జీతం లో టెన్ పెర్సెంట్ తక్కువవా?అదీ ప్రతి నేలాను"అక్కసుగా అంది.
గుమ్మందగ్గరైన శబ్దానికి బైటికొచ్చాడు శ్రావణ్.
ఎదురుగా ఉన్న భార్యను,కొడుకును చూసి ఆశ్చర్యపోయి,వెంటనే తేరుకొని
"అదేంటి ఇంత సడెన్ గా వచ్చారు,అయినా ఈ ఇల్లెలా తెలిసింది"? కొడుకును అడిగాడు
వెంటనే వసుంధర కోపంగా "ఎం బండారం బైటపడిందని కంగారు పడుతున్నారా?"అంటూ గయ మంది ఇంతలో ముగ్గురు స్త్రీలు బైటికి వచ్చారు.
అందరికీ ఎనభై సంవత్సరాల వయస్సు ఉంటింది.నడవటమే కష్టంగా ఉన్నా మెల్లగా వచ్చారు. పట్టరాని కోపంతో ఇంకా ఏదో అనబోతున్న వసుంధరకు వాళ్లను చూసి నోట మాట రాలేదు.. ఒకామె ముందుకు వచ్చి,
"అమ్మా నువ్వనుకున్నట్టు మా శ్రావణ్ బాబు ఏ తప్పూ చేయలేదమ్మా,మేము ముగ్గురం శ్రావణ్ తల్లికి ప్రాణ స్నేహితులం. ఈ బాబు చిన్న పిల్లాడిగా ఉన్నపుడే ఇతని తల్లి కాలం చేసింది.శ్రావణ్ ను మా చేతిలో పెడుతూ
జాగ్రత్తలు చెప్పింది. అప్పటినుండి మా పిల్లలతో పాటే పెరుగుతూ వచ్చాడు. వాళ్ళతో కలసి మెలిసి తిరిగినా,వాళ్ల బుద్దులేవీ వీడికి రాలేదమ్మా మా పిల్లలకు మేం భారమయ్యాం. మా ఆలనా పాలనా తన నెత్తినేసుకొని ,ఇదిగో ఈ ఇల్లు అద్దెకు తీసుకొని మమ్మలను పోషిస్తున్నాడు.వీడికి తల్లి అంటే ఎంతో ఇష్టం . రోజూ వచ్చి మాతో కొంతసమయం గడిపి,మా యోగక్షేమాలు చూసివెళతాడు.ఉన్న కాసేపు వాడి తల్లి చిన్నప్పటి ఉసులూ,ఆమెబాల్యం,మాతో గడిపిన సంఘటనలు మమ్మలను అడిగి తెలుసుకుంటాడు
మా మాటల్లో,నవ్వుల్లో తన తల్లిని వెతుక్కుంటాడు. మాకింత ముద్దపెట్టి మాలో తన తల్లిని చూసుకుంటున్నాడమ్మా నీ భర్త.;తల్లంటే అంత ప్రేమ వీడికి".
చెప్పుకుపోతున్న ఆ పండుటాకులను చూసి నిష్చేస్టురాలయింది వసుంధర.
తల్లిని ఇంతగా ప్రేమించే వ్యక్తీ తన భర్త కావటం తన అదృష్టం. తప్పుగా ఊహించి నందుకు ఒకింత సిగ్గుపడి,
శ్రావణ్ కు దగ్గరగా జరుగుతూ
"మరు జన్మంటూ ఉంటే నీకు అమ్మని పుడతా" అప్రయత్నంగా బైటికే అనేసింది వసుంధర
రెండు కన్నీటిబొట్లు చెంపలపై జారుతూ అతని పాదాలపై పడ్డాయి.