జాషువా గూర్చి సుధాకర్ వ్రాసిన కవిత్ చాల బాగుంది.
ముఖ్యంగా "రోమ్ నగరం" .. మరియు "వీళ్ళేం చేస్తున్నారో" అన్న వాక్యాలు చాలు,
మనుషుల్లో ఏమాత్రం ఇంగితం ఉన్నా అంతర్మదనం ప్రారంభమవుతుంది.
Monday, March 7, 2011
ఒకే వేదికపై శ్రీయుతులుకాళీపట్నం రామారావు,ద్విభాష్యం రాజేశ్వరావు,చాగంటితులసి,ఎల్.ఆర్.స్వామి,
గొల్లపూడిమారుతీరావు,వివినమూర్తి,అవసరాలరామకృష్నారావు,అర్నాద్పి.వి.శేషారత్నం,ఆదూరిసీతారామమూర్తిఘండికోటబ్రహ్మాజి,కాశీవిశ్వనాద్,వాసిరెడ్డినవీన్,అట్టాడ అప్పలనాయుడు,గంట్యాడగౌరునాయుడు
రామతీర్థ ఒక్కరేమిటి ఎందరో అంద్రిమధ్యారోజంతా గడిపాను
దశాబ్దాలు మారినా పత్రికా రంగంలో తన ఉనికినీ
నాణ్యతనూ నిలుపుకుంటున్న వారపత్రిక "నవ్య"
సాహితీ రంగంలో లబ్దప్రతిష్టులైన కథకుల పరిచయాలూ
వారికిష్టమైన కథలను "నవ్య నీరాజనం" పేరుతో వంద
వారాలపాటు ప్రచురించటమంటే మాటలు కాదు. అందువలన
సాహిత్యాభిమానులకు ఆయా రచయితలను మరింత దగ్గరగా
చూసిన అనుభూతి కలుగుతుంది.
ఇదంతా ఒక ఎత్తైతే ఆ కథల సమీక్షణం పేరుతో ఆ రచయితలం
దరినీ ఒక వేదిక మీద కలపటం,ఒక రోజంతా అందరూ గడపటమూ
నిజంగా నాలాంటి సాహిత్యాభిమానికి పండగే.